Crime: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు. బద్లాపూర్లోని షిర్గావ్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో బుధ, గురువారాల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.