Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!
- తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు
- శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు
- భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం ఆలయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరగనుంది.
Also Read
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి శోభ కనిపిస్తోంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరంకు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి.. అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.35కు వైభవంగా శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. రాత్రి 12కు లింగోద్భవ పూజ జరగనుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
మహా శివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలంకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, ఆలయ ఉత్సవం ఉంటుంది. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనుంది. మహానంది క్షేత్రంలో నేడు రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయంలో మహా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!