హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పూర్ణిమ’ లేదా ‘మహా మాఘి’ అని పిలుస్తారు. దేవతలు సైతం భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, దానాలకు సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. 2026లో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున ఏ వస్తువులను…
మాఘపౌర్ణమి సందర్భంగా నదీసాగర సంగమ స్థానాలు, సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రాలోని కోస్తాతీరంలోని పలు ప్రాంతాలతోపాటు హంసల దీవి, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం.