Magha Purnima: మాఘ పౌర్ణమి సందర్భంగా సాగర తీరంలో భక్తుల స్నానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magha Purnima: మాఘపౌర్ణమి సందర్భంగా నదీసాగర సంగమ స్థానాలు, సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రాలోని కోస్తాతీరంలోని పలు ప్రాంతాలతోపాటు హంసల దీవి, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం. నెలంతా వీలుకాకుంటే కనీసం మాఘ పూర్ణిమ రోజైనా పవిత్ర నదులు, సముద్రంలో స్నానం ఆచరిస్తే నెలంతటి ఫలితం కలుగుతుందని ఓ నమ్మకం. ఈ కారణంగా ఈరోజు తెల్లవారు జాము నుంచి భక్తులు నదీసాగర సంగమ స్థలాలు, తీరప్రాంతాల్లో స్నానాలకు పోటెత్తారు. అనకాపల్లి జిల్లా రేవుపోలవరం సముద్ర తీరoలో భక్తులు పెద్దఎత్తున సముద్రస్నానాలు చేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్ర స్నానాలు చేసి తీరంలో కొండపై ఉన్న శ్రీ మాధవస్వామిని భక్తులు దర్శించుకుoటున్నారు. సముద్ర స్నానాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Read Also: Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని సముద్ర తీరాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పూడిమడక, రాంబిల్లి రేవులకు భక్తులు భారీగా తరలివచ్చారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గజఈతగాళ్లను పోలీసులు సిద్ధం చేశారు. సముద్ర తీరం వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గ్రామస్థులు,పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల నగదు, విలువైన వస్తువులూ చోరీలకు గురికాకుండా మైక్లతో పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర స్నానాలకు వచ్చిన భక్తులకు పలు స్వచ్చంద సంస్థలు మజ్జిగ, మంచినీళ్లూ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి సమీపంలోను, విశాఖ జిల్లా భీమిలిలోని నదీ సాగర సంగమ స్థానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కోస్తా తీరం అంతటా భక్తుల రద్దీ కనిపించింది. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!