సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి (NDA) 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆశాభావం వ్యక్తంచేశారు.
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈ