Home
Latest Telugu News
Latest Telugu News News
-
Telangana: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభా.. దేశ సగటు కంటే అధికం
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా… -
Andhra Pradesh: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ… -
Telangana: సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను… -
Andhra Pradesh: 2021లో భారీగా పెరిగిన రోడ్డుప్రమాదాల మృతుల సంఖ్య
కరోనా లాక్డౌన్ కారణంగా 2020లో ఏపీలో రోడ్డుప్రమాదాలు తగ్గాయి. అయితే 2021లో మళ్లీ రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఏపీ రహదారి భద్రత కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత ఏడాది ఏపీలో మొత్తం 19,729 రోడ్డుప్రమాదాలు జరగ్గా.. వాటిలో 8,053 మంది చనిపోయారు. మరో 21,169 మంది గాయపడ్డారు. 2020తో పోలిస్తే 2021లో రోడ్డుప్రమాదాల్లో 10.16 శాతం, మరణాల్లో 14.08 శాతం, క్షతగాత్రుల్లో 7.94… -
Andhra Pradesh: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు
మహిళా ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఏపీలోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించి మంగళవార రాత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ మేరకు పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్గ్రేషియా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉ. 10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. లక్ష ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం.. విద్య, పోలీస్, వైద్య శాఖల్లో భారీగా పోస్టులు★ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు★ నేడు హైదరాబాద్లో కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో భేటీ కానున్న కృష్ణా బోర్డు ఛైర్మన్★ నేడు కాకినాడ జేఎన్టీయూ 8వ స్నాతకోత్సవం , ఆన్లైన్… -
Sajjala Ramakrishna : 50 శాతానికి పైగా మహిళలకి చట్ట సభల్లో రిజర్వేషన్లు
విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి… -
No Mercy : మహిళా దినోత్సవం రోజు.. బ్రిటన్ యువతిపై అత్యాచారయత్నం..
ఎన్ని చట్టా చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా విచక్షణరహితంగా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. ఈ రోజు ఏ ఒక్క మగాడిని అడిగిన అమ్మ గురించి.. అంతేకాకుండా తన అక్కచెల్లెళ్లు, భార్య ఇతరుల గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే ఈ రోజునే ఓ ఇద్దరు కామాంధులు స్వదేశానికి వచ్చిన పరదేశి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో… -
Ukraine War : రష్యాతో యుద్ధం చేస్తున్న తమిళ బిడ్డ
జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. కానీ కొన్ని అవకాశాలు అనుకోని వరంలా వచ్చిపడతాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ విషయంలో కూడా అదే జరిగింది. సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లూ విఫలమయ్యాడు. తరువాత అమెరికా సైన్యంలో అయినా చేరుదామనుకుని చెన్నయ్లోని అమెరికన్ కాన్సులేట్ని సంప్రదించాడు. అక్కడా అతనికి నిరాశే ఎదురైంది. దాంతో అతడు పై చదువుల కోసం 2018లో ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడి నేషనల్ ఏరో… -
C. Kalyan : చిరంజీవే మాకు పెద్ద.. త్వరలోనే సీఎంలను సన్మానిస్తాం..
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ…
తాజావార్తలు
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
-
Ranbir Kapoor: రణ్బీర్ కపూర్ డైలమా.. సందీప్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇస్తాడా?
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!