MP Appalanaidu: చేనేత దినోత్సవం.. ప్రధానికి టీడీపీ ఎంపీ అపురూప కానుక
- ప్రధానికి అపురూప కానుక ఇచ్చిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు
- సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Appalanaidu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు. ఎంపీ సూచనల మేరకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని లావేరు మండలంలో గల చేనేత కుటుంబమైన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో ప్రారంభించి.. మూడు అడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవు గల చేనేత వస్త్రంపై మోడీ లఘు చిత్రాన్ని నేశారు. 40 రోజుల పాటు శ్రమించి ఈ పనిని పూర్తి చేశారు. ఆ వస్త్రాన్ని చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానిని కలిసి ఎంపీ అందజేయగా.. మోడీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ వస్త్రంపై తన రూపాన్ని చూసి ‘చాలా ధన్యవాదాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
Also Read
- Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
జాతీయ చేనేత దినోత్సవం నాడు లఘు చిత్రాన్ని అందుకోవడం స్వీట్ మెమరీగా భావిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. 40 రోజులపాటు ఎంతో కష్టపడి తన లఘు చిత్రాన్ని చేనేత వస్త్రంపై నేచిన శ్రీ బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు అభినందనలు తెలపాలని ఎంపీ అప్పలనాయుడికి ప్రధాని మోడీ సూచించారు. అంతే కాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా అప్పలనాయుడు ప్రధానికి అందజేశారు.ఈ సందర్భంలో ‘అశోక్ గజపతి రాజు ఎలా ఉన్నారు? ఆయన హెల్త్ ఓకేనా?’ అని కుశల ప్రశ్నలను మోడీ అడిగారు. పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేయగానే.. ఆ పుస్తకాన్ని పట్టుకొని నాలుగైదు పేజీలు తిరగేసి పీవీజీ ఫోటోలను మోడీ పరిశీలనగా చూశారు. గుడ్.. గుడ్.. అని ప్రశంసించారు. పీవీజీ రాజు ఒక సామాజిక చైతన్య వేత్త అని మోడీ వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి రాజుని అడిగానని చెప్పాలని.. ఆయనను ఒకసారి రావాలని కూడా చెప్పమని ప్రధాని ఎంపీ అప్పలనాయుడుకు సూచించారు. అలాగే ప్రధానికి చేనేత వస్త్రాలను కూడా అందజేశారు.
తాజావార్తలు
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
-
Vivo V40e 5G: స్టైలిష్ డిజైన్, 50MP సోనీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో.. వివో V40e 5G ప్రీమియం స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!