MP Appalanaidu: చేనేత దినోత్సవం.. ప్రధానికి టీడీపీ ఎంపీ అపురూప కానుక
- ప్రధానికి అపురూప కానుక ఇచ్చిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు
- సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Appalanaidu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు. ఎంపీ సూచనల మేరకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని లావేరు మండలంలో గల చేనేత కుటుంబమైన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో ప్రారంభించి.. మూడు అడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవు గల చేనేత వస్త్రంపై మోడీ లఘు చిత్రాన్ని నేశారు. 40 రోజుల పాటు శ్రమించి ఈ పనిని పూర్తి చేశారు. ఆ వస్త్రాన్ని చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానిని కలిసి ఎంపీ అందజేయగా.. మోడీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ వస్త్రంపై తన రూపాన్ని చూసి ‘చాలా ధన్యవాదాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
Also Read
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
జాతీయ చేనేత దినోత్సవం నాడు లఘు చిత్రాన్ని అందుకోవడం స్వీట్ మెమరీగా భావిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. 40 రోజులపాటు ఎంతో కష్టపడి తన లఘు చిత్రాన్ని చేనేత వస్త్రంపై నేచిన శ్రీ బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులకు అభినందనలు తెలపాలని ఎంపీ అప్పలనాయుడికి ప్రధాని మోడీ సూచించారు. అంతే కాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా అప్పలనాయుడు ప్రధానికి అందజేశారు.ఈ సందర్భంలో ‘అశోక్ గజపతి రాజు ఎలా ఉన్నారు? ఆయన హెల్త్ ఓకేనా?’ అని కుశల ప్రశ్నలను మోడీ అడిగారు. పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేయగానే.. ఆ పుస్తకాన్ని పట్టుకొని నాలుగైదు పేజీలు తిరగేసి పీవీజీ ఫోటోలను మోడీ పరిశీలనగా చూశారు. గుడ్.. గుడ్.. అని ప్రశంసించారు. పీవీజీ రాజు ఒక సామాజిక చైతన్య వేత్త అని మోడీ వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి రాజుని అడిగానని చెప్పాలని.. ఆయనను ఒకసారి రావాలని కూడా చెప్పమని ప్రధాని ఎంపీ అప్పలనాయుడుకు సూచించారు. అలాగే ప్రధానికి చేనేత వస్త్రాలను కూడా అందజేశారు.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!