హైదరాబాద్కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ పై కేసు నమోదు చేసింది సీబీఐ. ఓ వ్యక్తి నుండి జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాల పై ఫైన్ విధించిన జీఎస్టీ అధికారులు… బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో…
ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు…
హైదరాబాద్లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామాటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరెగాయి.. దీంతో.. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే.. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో 5 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన…
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందన్నారు. పథకం ప్రారంభ సమయంలో…
టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన…
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ విద్యావ్యవస్థకు శాపంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య సంస్థల పనితీరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఉన్నత విద్యలో మాత్రమే కాదు, ప్రాథమిక విద్యలోనూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికి తీసికట్టుగా ఉందని ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి…
ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రైవేట్ పార్టీలపై దాడులు చేయడం, అనుమతి లేకుండా మద్యం అందిస్తున్నారని కేసులు బుక్ చేయడం పౌరులకు మద్యం అందించే పార్టీలకు అనుమతి అవసరమా అనే సందేహాన్ని కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, నివాసాల వద్ద జరిగే ప్రైవేట్ పార్టీలలో భారీ మొత్తంలో మద్యం సరఫరా చేసేందుకు ప్రజలు తప్పనిసరిగా లైసెన్స్లు పొందాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇంట్లో జరిగే పార్టీలకు మద్యం తక్కువ పరిమాణంలో అంటే ఆరు…
శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద అధికారులు డ్యాం క్రెస్ట్గేట్లను మూసివేసి దిగువకు నీటి విడుదలను నిలిపివేయడంతో మత్స్యకారులు తమ దేశ పడవల్లో చేపల వేటకు పెద్ద సంఖ్యలో వచ్చారు . గత రెండు వారాలుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో డ్యాం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. అయితే గత రెండ్రోజుల నుంచి ఇన్ ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ క్రెస్ట్ గేట్లను మూసివేశారు. ఇన్ని…
మంగళవారం కురిసిన వర్షానికి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్లోని రీసెర్చ్ స్కాలర్స్ మెస్ సౌకర్యం మరోసారి నీటితో నిండిపోయింది. నేలపై చీలమండల పొడవు నీరు ఉండటంతో విద్యార్థులు ఇండోర్ పూల్లో భోజనం చేయవలసి వచ్చింది. నీటితో నిండిన భోజన సదుపాయానికి సంబంధించిన అనేక వీడియోలను రీసెర్చ్ స్కాలర్లు ప్రసారం చేశారు. అలాంటి ఒక వీడియోలో, రెయిన్కోట్ను ధరించిన వారిలో ఒకరితో ఉన్న ఇద్దరు విద్యార్థులు నేల నుండి వర్షపు నీటిని మానవీయంగా ఒక గిన్నెలోకి పోసి, సమస్య…