Telangana: ఇలా కూడా ఉంటారా?.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ.. దత్తత పేరుతో డ్రామా!
- సొంత మనవడిని అమ్మకానికి పెట్టిన నాయనమ్మ
- దత్తత పేరుతో హైడ్రామాకు తెరతీసిన నాయనమ్మ
- పోలీసులను ఆశ్రయించిన కన్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grand Mother Sold Her Grand Son in Khammam District: తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది. తన సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తతపేరుతో నాయనమ్మ హైడ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహాయంతో హైదారాబాద్ వాసికి మనవడిని అమ్మేసింది. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని కోడలి వద్ద నుంచి మనవడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. నా మనవడిని నువ్వు సాకలేవంటూ నాయనమ్మ పందుల నాగమణి దత్తత తీసుకుంది. దత్తత తరువాత 5లక్షలకు అమ్మేసిందంటూ కోడలు స్వప్న పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Minister Nara Lokesh: టీడీపీ నేత దారుణ హత్య.. ఖండించిన మంత్రి నారా లోకేష్..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
రఘునాథ పాలెంకి చెందిన పందుల సాయి, ఖమ్మం నగరంలో నిజాం పేటకు చెందిన కొమ్మినబోయిన స్వప్న 2021 డిసెంబరు లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2023లో బాబు పుట్టాడు.బాబు పుట్టిన నెల రోజులకే 2023లో పందుల సాయి ప్రమాదంలో మృతి చెందాడు. సాయి మృతి అనంతరం కార్పొరేటర్ సహకారంతో అత్త పందుల నాగమణి తన కోడలి వద్ద నుండి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే బాబును దత్తత ఇస్తున్నాను అంటూ బాబును అమ్మకానికి పెట్టింది. అయితే బాబు కోసం స్వప్న ఎంతగానో తపించింది. తన బాబును తనకు ఇవ్వమని కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగింది. అయినా పట్టించుకోలేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కార్పొరేటర్ భర్త వద్ద కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి. చివరకు తన బాబును తనకు ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?