Telangana: ఇలా కూడా ఉంటారా?.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ.. దత్తత పేరుతో డ్రామా!
- సొంత మనవడిని అమ్మకానికి పెట్టిన నాయనమ్మ
- దత్తత పేరుతో హైడ్రామాకు తెరతీసిన నాయనమ్మ
- పోలీసులను ఆశ్రయించిన కన్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grand Mother Sold Her Grand Son in Khammam District: తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది. తన సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తతపేరుతో నాయనమ్మ హైడ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహాయంతో హైదారాబాద్ వాసికి మనవడిని అమ్మేసింది. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని కోడలి వద్ద నుంచి మనవడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. నా మనవడిని నువ్వు సాకలేవంటూ నాయనమ్మ పందుల నాగమణి దత్తత తీసుకుంది. దత్తత తరువాత 5లక్షలకు అమ్మేసిందంటూ కోడలు స్వప్న పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Minister Nara Lokesh: టీడీపీ నేత దారుణ హత్య.. ఖండించిన మంత్రి నారా లోకేష్..
Also Read
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
రఘునాథ పాలెంకి చెందిన పందుల సాయి, ఖమ్మం నగరంలో నిజాం పేటకు చెందిన కొమ్మినబోయిన స్వప్న 2021 డిసెంబరు లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2023లో బాబు పుట్టాడు.బాబు పుట్టిన నెల రోజులకే 2023లో పందుల సాయి ప్రమాదంలో మృతి చెందాడు. సాయి మృతి అనంతరం కార్పొరేటర్ సహకారంతో అత్త పందుల నాగమణి తన కోడలి వద్ద నుండి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే బాబును దత్తత ఇస్తున్నాను అంటూ బాబును అమ్మకానికి పెట్టింది. అయితే బాబు కోసం స్వప్న ఎంతగానో తపించింది. తన బాబును తనకు ఇవ్వమని కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగింది. అయినా పట్టించుకోలేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కార్పొరేటర్ భర్త వద్ద కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి. చివరకు తన బాబును తనకు ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!