హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
తెలంగాణలో వరదలకు జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టానికి 79.57 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల అకౌంట్లకే నేరుగా జమా చేసేటట్టు ఏర్పాట్లు ప్రభుత్వం చేయనుంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్…
డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక ఆధారంగా కుద్రింపు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.…
ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం .. అందుకే దాడులు చేస్తుందంటూ నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాంట్లో ఓ వ్యక్తి పడి తల పగిలిందని, అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళానన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన గుండాలతో వచ్చి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లంగపని..దొంగ పని నేను చేయనని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే.. పోలీసులు ఎంఐఎం వాళ్లపై పెట్టిన కేసులే మా…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) క్లిష్టమైన వ్యర్థాల నిర్వహణ సవాళ్లను పరిష్కరించడం ద్వారా నగర పరిశుభ్రతను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (SWM) కోసం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం ఆపరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అమలు చేయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించింది. వ్యర్థాల నిర్వహణ కోసం ICCC కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ,…