చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్పై గెలుపొందిన నూతన శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) నారాయణన్ శ్రీ గణేష్ మాట్లాడుతూ.. SCB-GHMC విలీనాన్ని ప్రారంభించలేదని అందుకోసం.. ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్ధమని అన్నారు. 2019 , 2023లో, గణేష్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) టిక్కెట్పై పోటీ చేసినప్పటికీ రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నీటి సరఫరా, విద్యా మౌలిక సదుపాయాలు , SCB-GHMC విలీనంతో సహా పలు అంశాలపై ప్రసంగించారు. విలీనాన్ని సమర్థించిన…
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణ నేప+థ్యంలో మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో…
భారతీయ రైల్వే ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), సికింద్రాబాద్ డివిజన్ తన కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు, ‘ఆపరేషన్ నార్కోస్’ కింద, ఆర్పిఎఫ్ సిబ్బంది 37 సంఘటనలలో రూ. 2.7 కోట్ల విలువైన 1,084 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో, RPF అధికారులు డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై 36 మంది వ్యక్తులను అరెస్టు చేశారు, గత సంవత్సరం ఇదే…
కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 71 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రులతో ప్రమాణం చేయించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. వీరితో పాటు.. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్నాథ్…
రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా . అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ నాన్న తరువాత గురువు దైవంతో సమానం అని చెప్పే మన సమాజంలో.. అదే గురువు కాల సర్పం అయితే.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మైనర్పై అఘాయిత్యం వెలుగులోకి…
రాష్ట్రంలోని 436 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల మరమ్మతులు చేపడతారు, అయితే లోక్సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడానికి టెండర్లను ఖరారు చేయలేకపోయింది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్…