వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఎన్నికలకు ముందు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి… ఇప్పుడు సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులను దగా చేయవద్దని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.…
నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై... సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు.
బీజీపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని , బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడడం మానుకోవాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘనాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదన్నారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు కడియం శ్రీహరి.…
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ వార్తల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు తన మండలి సభ్యులతో కలిసి వరుసగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. కుమార్ కరీంనగర్ నివాసంలో ఆయన భార్య అపర్ణ విలేకరులతో మాట్లాడుతూ, ఇది తమ జీవితంలో అత్యుత్తమ క్షణం అని అన్నారు. “మేమంతా చాలా…
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు పని ప్రారంభించారు. వివిధ కీలక శాఖల నుంచి టీడీపీ అధినేత సమాచారం తెప్పించుకుంటున్నారు. కీలకాంశాలపై వరుస రివ్యూలు ఉంటాయని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు తెలిపారు. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు సిద్దం అవుతున్నారు కీలక శాఖల అధికారులు. ఇరిగేషన్ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్దం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్సు కో, జెన్కోలలో పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న…
ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి శ్రీనివాస్ వర్మకు సమాచారం వచ్చింది.
నెల్లూరు జిల్లాలో సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వరి, ఇతర ఆహార ధాన్యాలు పండించే చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో మెల్లగా వాణిజ్య, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన నీటిపారుదల సౌకర్యం , కండేలేరు , సోమశిల రిజర్వాయర్ల నుండి పుష్కలంగా నీరు ఉన్నందున, రైతులు కొత్త వాణిజ్య పంటను కనుగొన్నారు, కలబంద, ఔషధ గుణాలు , సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతుంది, ఈ మొక్క తక్కువ నీటితో పెరుగుతుంది కాబట్టి…
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు వీఐపీలురానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఐటీ పార్కు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి (రవాణా, రోడ్లు, భవనాలు) ప్రద్యుమ్న పరిశీలించారు. ప్రద్యుమ్న శనివారం…