“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా…
హిజ్రీ క్యాలెండర్లోని మొదటి నెల మొహర్రం పదవ రోజున వచ్చే ‘యుమ్-ఇ అషూరా’ను తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు బుధవారం ఆచరించారు. శతాబ్దాల క్రితం జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన జ్ఞాపకార్థం ఈ రోజు. నగరవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. యువకులు ప్రజల మధ్య ప్రధాన కూడళ్లలో వాటర్ బాటిళ్లు , షర్బత్లను పంపిణీ చేశారు, అలాగే ఆసుపత్రులు , వృద్ధాశ్రమాలను సందర్శించి ఆహారం…
ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని,…
ఈరోజు NDSA చైర్మన్, అధికారులతో మాట్లాడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలో NDSA కమిటీతో సమావేశం ఉంటుందని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్…
ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని…
ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు.
ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదిక వద్ద సంబరాలు జరుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హోదాలో రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయబోతున్నారని, లక్ష రూపాయలు ఒకసారి… ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని ప్రభుత్వ నిర్ణయమన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కుటుంబ నిర్దారణ కోసమే రేషన్ కార్డు అడిగామని, గత రెండు సార్లు చేసినట్లుగానే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. అంతేకాకుండా.. పాత…
కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.…
సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్…