సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్క్యుషన్ పెట్టారన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ఆయన ప్రశ్నించారు. బీఅర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్…
లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్ను రూపొందించారని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీహార్కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా…
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని అధికారులను కోరారు. రాబోయే మూడు రోజులలో 30-40 కి.మీ/గం గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 22, సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో నిర్వహించిన…
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా పంట రుణమాఫీని అమలు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సీనియర్ నేతలు హరీష్రావు , జగదీష్ రెడ్డి తదితరులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ వద్ద సమావేశమై తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి…
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు.
బెంగళూరులోని స్విగ్గీ మరియు జొమాటో డెలివరీ ఏజెంట్లతో యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. అందులో వారి ఆదాయాల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.