జగన్ ఢిల్లీకి డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. మీరు మీరు కొట్టుకుని, చంపుకొని కూటమి పై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లను 24 గంటల్లో చెప్పు జగన్ అని ఆయన సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయిందని, ఇక జగన్ ను డ్రామాల రెడ్డిగా పిలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. విధ్వంస పాలనను…
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని,…
టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ…
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ లాబీలో విడివిడిగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు.…
బెంగళూరు-హైదరాబాద్ హైవేను 4 లేన్ల నుంచి 12 లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కర్నూలు, అనంతపురం సహా నగరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. NH 44 వద్ద ఈ ప్రధాన అభివృద్ధి ఈ నగరాలను పెద్ద నగరాలు , మార్కర్లకు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, మెరుగైన మౌలిక సదుపాయాలు పెద్ద పెట్టుబడులకు, మెరుగైన…
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి నాలుగో రోజునా విచారణ ముమ్మరంగా సాగింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తాసిల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైకాపా బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెలగక్కారు. దీంతోపాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు… Kanwar Yatra: యాత్ర శాంతియుతంగా…
నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ జరుగనుంది. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతారు. . సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు…
మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకునే వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.