అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి…
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
హైదరాబాద్లోని మంథన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దైవిక్ తన పదేళ్ల వయసులో ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం బ్రిబుక్స్లో జాబితా చేయబడింది , ఆభరణాలను తయారు చేసే కళకు ప్రసిద్ధి చెందిన రాజ్యం గురించి , దొంగలు దోచుకున్న తప్పిపోయిన ఆభరణాల రహస్యాన్ని యువరాజు ఎలా విప్పాడు. కల్పిత కథ విడుదలైనప్పటి నుండి, పుస్తక ప్రియులచే ప్రశంసించబడింది, అయితే యువ రచయిత ఇటీవలే బ్రిబుక్స్ నుండి ప్లాటినం…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని,…
విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మూసారాంబాగ్లోని లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్పై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మందుల నిల్వలను గుర్తించారు. ఈ దాడిలో అలవాటును పెంచే మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, అబార్టిఫేషియెంట్ డ్రగ్స్, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తదితర 19 రకాల రూ. 3.5 లక్షలు విలువ చేసే మందులను అధికారులు గుర్తించారు. మలక్పేట డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జి. అనిల్, సికింద్రాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్…
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ప్రాంతంలో ఓ మహిళను ఆమె కొడుకు హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వినయ్ కుమార్ పసి (28) అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న తన తల్లి తుల్జా కుమారి పసి (55) తలపై ఇనుప రాడ్తో కొట్టినట్లు సమాచారం. తెల్లవారుజాము వరకు తుల్జాకుమారి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో మనవరాలు ఇంటికి వచ్చి పరిశీలించారు. ఆమె ఇంట్లోకి ప్రవేశించగా, లోపలి నుండి…
సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి కేంద్రం రెండు పథకాల కిందే 50 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని,…
ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు.