Telangana: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆగస్టు 15 తర్వాత డీఏ ప్రకటన!
- ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తాం
- ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు. ఒకటా, రెండా అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు. యూయస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా.. ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించమని సూచించారు. ఆమేరకు ఈరోజు యూయస్పీసీ, జాక్టో, టీటీజేఏసీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు.బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందించారు.
Read Also: Siddipet: నిరుపేద విద్యార్థికి కలెక్టర్ చేయూత.. ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డురావద్దని సాయం
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీల్స్ను సత్వరమే పరిష్కరించాలని కోరగా.. పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తామన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అడగగా.. అప్పటికప్పుడే డీజీపీకి విషయం చెప్పి ఉపసంహరించమని కోరారు. అన్ని సంఘాలు చర్చించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందించి ఇస్తే మూడు జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించిన తదుపరి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పటానికి అపాయింట్ మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు 40 మంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!