2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.