Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kurnool Ycp Leaders

నీటి వివాదాలపై కర్నూలు వైసీపీ నేతలు మౌనం…?

Published Date :July 10, 2021 , 10:23 pm
By Manohar
నీటి వివాదాలపై కర్నూలు వైసీపీ నేతలు మౌనం…?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రజల కష్టాలు, ప్రాంతం సమస్యల కంటే వారికి సొంత వ్యాపారాలు.. ఆస్తులే ఎక్కువ అయ్యాయా? తీవ్ర నష్టం చేకూర్చే చర్యలు జరుగుతోన్నా.. అధినేతను విమర్శిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం అదేనా? సీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్‌.. RDS కుడి కాల్వలకు తెలంగాణ అడ్డుపడినా కర్నూలు నేతలు స్పందించకపోవడానికి అవే కారణాలా?

జల జగడంపై పెదవి విప్పని కర్నూలు వైసీపీ నేతలు!

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

రాయలసీమ ఎత్తిపోతల పథకం, RDS కుడి కాలువ పనులు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సీఎం జగన్ పై తెలంగాణ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, తెలంగాణ బీజేపీ నేతలు అంతగా విమర్శిస్తున్నా ఈ రెండు ప్రాజెక్టులు ఉన్న కర్నూలు జిల్లాలోని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు. ఒక్క మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం ఎదురుదాడి చేశారు. వైసీపీకి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు.. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ వివాదంపై కనీసం ఆ నియోజకర్గాల ఎమ్మెల్యేలు కూడా నోరు మేదపలేదు.

సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నేతలు ఎందుకు మౌనం?

సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే సాధారణంగా వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి మాటల దాడి చేస్తారు. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపకల్పన చేస్తే.. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఎంత అవసరం ఉందో.. ఏటా తుంగభద్ర, కృష్ణా జలాలను ఏ విధంగా రాయలసీమ నష్టపోతుందో సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదన్న చర్చ జరుగుతోంది. RDS కుడి కాలువ, రాయలసీమ ఎత్తిపోతల పథకం వస్తే సీమ ప్రాజెక్టులకు చాలా వరకు నీటి లభ్యత పెరుగుతుంది. రాయలసీమకు ఏటా 450 టీఎంసీల నీరు అవసరమైతే కేవలం 150 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కళ్ల ముందు ఇన్ని లెక్కలు ఉన్నా.. వైసీపీలో సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నాయకులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారన్న చర్చ సాగుతోంది.

తెలంగాణలో ఆస్తులు ఉన్నాయనా?
అధిష్ఠానం మాట్లాడొద్దని ఆదేశించిందా?

జలవివాదంపై కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పెదవి విప్పకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. కర్నూలు జిల్లాలో అన్ని పార్టీల నేతలకు తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు నీటి సమస్యపై తెలంగాణ నేతల విమర్శల మీద ఎదురుదాడి చేస్తే సమస్యలు వస్తాయని మౌనం వహిస్తున్నారా అని చర్చ జరుగుతోంది. అయితే జలవివాదంపై కర్నూలు జిల్లా నేతలకు పార్టీ అధిష్ఠానం ఏవైనా ఆదేశాలు ఇచ్చిందా.. అందుకే సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించినా వైసీపీ నేతలు సైలెంటయ్యారా అని చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య, ప్రత్యేకించి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల మధ్య జలజగడం జరుగుతుంటే అధికార పార్టీ నేతల స్పందన అంతంతమాత్రంగానే ఉండడం చర్చగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Kurnool
  • kurnool ycp leaders
  • telangana
  • YCP leaders

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions