ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని బాధతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో చోటుచేసుకుంది.
ఈ రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదంటే నిలుచున్నప్పుడు కూడా సడెన్గా గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. శుభకార్యాలు, పెళ్లి వేడుకల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా కోసిగి మండలం కడదొడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచ్ హుసేని అక్కడి నుంచి పరారయ్యాడు.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో అన్ని ఏర్పాట్లు చేశారు.. సగం కార్యక్రమాలు పూర్తి చేశారు.. కానీ, పెళ్లి సమయానికి పెళ్లి కూతురు వెళ్లిపోవడంతో.. ఆ మ్యారేజ్ పీఠలపైనే నిలిచిపోయినట్టు అయ్యింది..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది.
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు…
కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఆలయం వంటి విద్యాలయాన్ని అకృత్యాలకు వేదికగా చేసుకున్నాడో ఘనుడు. అభం శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు..
పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో వాళ్లకి.. స్నేహితులకు కష్టాలు అంటే ఇదేనేమో.. కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తల్లిని పట్టుకుని స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది..