KTR : కేసీఆర్ సిట్కు పూర్తిగా సహకరించారు
- 8+8 గుండు సున్నా అనేది కాంగ్రెస్, బీజేపీకి తెలుసు
- వీళ్ల అసమర్థతను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ను విచారణకు పిలిచారు
- డైవర్షన్, సబ్ డైవర్షన్, పర్వర్షన్, ఇదీ కాంగ్రెస్ పాలన
- ఫోకస్ మళ్లించడానికే ఆదివారం విచారించారు
- సిట్ అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను వేధించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే, భయపడకుండా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. “నిజానికి కేసీఆర్ గారి వయసు, ఆయన హోదా దృష్ట్యా నివాసం నుండే విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. కోర్టును ఆశ్రయిస్తే ఈ విషయం తేలిపోయేది. కానీ, చట్టంపై ఉన్న గౌరవంతో ఆయన స్వయంగా వచ్చి 5 గంటల పాటు అధికారులకు సహకరించారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విచారణతో అధికారులకు కూడా ఎలాంటి తప్పు జరగలేదని అర్థమై ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ విచారణను తెరపైకి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు బడ్జెట్లో దక్కింది ‘గుండు సున్నా’ అని ఎద్దేవా చేశారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణించినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.
సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు కనీస ఏర్పాట్లు లేక మంత్రుల కార్లపై దాడులు జరుగుతున్నా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో విహరిస్తున్నారని విమర్శించారు. విచారణ పేరుతో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ‘లీకులు’ ఇస్తోందని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి తప్పుడు లీకులను నమ్మవద్దని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!