KTR : కేసీఆర్ సిట్కు పూర్తిగా సహకరించారు
- 8+8 గుండు సున్నా అనేది కాంగ్రెస్, బీజేపీకి తెలుసు
- వీళ్ల అసమర్థతను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ను విచారణకు పిలిచారు
- డైవర్షన్, సబ్ డైవర్షన్, పర్వర్షన్, ఇదీ కాంగ్రెస్ పాలన
- ఫోకస్ మళ్లించడానికే ఆదివారం విచారించారు
- సిట్ అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను వేధించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే, భయపడకుండా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. “నిజానికి కేసీఆర్ గారి వయసు, ఆయన హోదా దృష్ట్యా నివాసం నుండే విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. కోర్టును ఆశ్రయిస్తే ఈ విషయం తేలిపోయేది. కానీ, చట్టంపై ఉన్న గౌరవంతో ఆయన స్వయంగా వచ్చి 5 గంటల పాటు అధికారులకు సహకరించారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విచారణతో అధికారులకు కూడా ఎలాంటి తప్పు జరగలేదని అర్థమై ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ విచారణను తెరపైకి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు బడ్జెట్లో దక్కింది ‘గుండు సున్నా’ అని ఎద్దేవా చేశారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణించినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.
సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు కనీస ఏర్పాట్లు లేక మంత్రుల కార్లపై దాడులు జరుగుతున్నా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో విహరిస్తున్నారని విమర్శించారు. విచారణ పేరుతో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ‘లీకులు’ ఇస్తోందని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి తప్పుడు లీకులను నమ్మవద్దని కోరారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?