Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో…
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని…
అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్..…
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల…
నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదని గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు. కొన్ని పథకాల విషయంలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నాయని, పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశం లో చెప్పారన్నారు కేటీఆర్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి కూడా మేము గుర్తించామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 ఉన్నాయన్నారు. అవన్నీ బుక్ లెట్ లో…
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పార్టీలు, వేడుకలకు అతీతంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కేటీఆర్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాసన సభలో ప్రవేశ పెట్టాం.. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టేశారు.. కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేద పత్రం పేరిట తప్పుడు లెక్కలు చెప్పారు.. స్వేద పత్రం కాదు, ప్రజల చెమటతో స్వేద సోధ భవనాలు నిర్మించారు.. బిఆర్ఎస్ నేతల ఆర్థిక పరిస్థితి స్వేద పత్రం విడుదల చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
MP Bandi Sanjay Said BRS Will Lost Deposits in Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదని, డిపాజిట్లు గల్లంతవ్వడం తథ్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటూ అక్షరాలు మార్చి.. కాంగ్రెస్, బీఆర్ఎస్…