Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు, పట్టాలు ఇవ్వాలి కానీ, ఉన్న ఇళ్లను లాక్కోవడం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే నంబర్ 218 భూ బాధితులతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా ఇక్కడి బాధితుల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న ఆయన.. పేదలను, జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్న పాలకుల తీరుపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా దురదృష్టం కొద్దీ మొన్న వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేస్తే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరువు పోయిందని.. ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇళ్లను లాక్కోవడం దుర్మార్గమన్నారు. జాతీయ రహదారి పక్కన పేదవాడు ఇల్లు కట్టుకుని నివసిస్తే ప్రభుత్వానికి కళ్లు మండుతున్నాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 218 బాధితులకు గతంలోనే ‘గృహలక్ష్మి’ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని తక్షణమే వారికి ఇవ్వాలని.. లేదంటే మరో వెలుగుమట్ల తరహా ఉద్యమం పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించినప్పుడు, ఖమ్మంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అంతా బ్లాక్మెయిల్ రాజకీయమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. గత తొమ్మిదిన్నరేళ్లలో తాము రూ. 19 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కాలేజీల యాజమాన్యాలను పిలిపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను, తమ హక్కుల కోసం అడిగే ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయిస్తూ వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులకు పోయేకాలం దగ్గరపడిందని, మహా అయితే ఈ ప్రభుత్వానికి మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ప్రేమ, పనితనం, అభివృద్ధి మాత్రమే గెలుస్తాయని.. బ్లాక్మెయిల్ రాజకీయాలు సాగవని స్పష్టం చేశారు. బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారందరికీ కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడానని, అవసరమైతే రేపు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (CS) తో కూడా మాట్లాడి, బాధితులను హైదరాబాద్ తీసుకువెళ్లైనా సరే న్యాయం చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.
Also Read
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!