Sridhar Babu: అనవసరంగా వేధించవద్దు.. పోలీసులకు శ్రీధర్ బాబు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Babu: పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశయాల మేరకు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. మంథని ప్రాంతం శాంతిభద్రలతో కూడిన చదువుల తల్లి ప్రాంతంగా ఏర్పడడానికి అందరూ సహకరించాలన్నారు. శ్రీపాదరావు ఆశయాల మేరకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. మంథని ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాల అభివృద్ధి కోసం మంథని వద్ద రెండు జిల్లాల పరిధిలో గోదావరి నదిపై మంథని వద్ద వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చిల్లర గాళ్లు చేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి విషయాల్లో చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చట్టం పరిధిలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని కార్యకర్తలకు ఉపదేశించారు. పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని ఆదేశించారు.
Read also: Elevated Corridors: తెలంగాణకు175 ఎకరాల రక్షణ భూమి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
మంథనిలో గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లును మంత్రి పంపిణీ చేశారు. అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ, మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాడు పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని, రాజకీయంగా మన ప్రభుత్వంపై బురదజల్లాలని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శనలో కనీసం భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి నిపుణులైన ఇంజనీర్ల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఖాళీల విషయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలుకు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
Yadagirigutta: యదాద్రి ఇకపై యాదగిరిగుట్ట..! పేరు మార్చేందుకు కాంగ్రెస్ ఆలోచన..?
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?