Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా…
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్గా గుర్తించారు.
Bangladesh: భారతదేశంలోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. కోల్కతాలోని డిప్యూటీ హైకమిషనర్ షిక్దార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, త్రిపురలోని అగర్తలలో గల అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్ను రీకాల్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత కేటాయించారు. ఇటీవల బాలీవుడ్ నటులకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తి కూడా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను పెంచింది.
Kolkata : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచింది. అయితే దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఓ మహిళా డాక్టర్తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి…
West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.
దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ‘దానా’ తుఫానుగా నామాకరణం చేసినట్లు ఐఎండీ తెలిపింది.