పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర…
టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నమ్మించి దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే, ప్రజలకు టీకాపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ఆమె కూడా టీకా వేయించుకున్నారు. ఆతర్వాత ఆమె డీహైడ్రేషన్ కు గురైంది.. బీపీ కూడా పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆవెంటనే కడుపునొప్పి కూడా రావడంతో ఆమె అనారోగ్యానికి టీకానే…
ఇటీవల పశ్చిమ బెంగాల్కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు ప్రధానకారణం ప్రభుత్వమే అని, మమత సర్కార్ అండదండలతో తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారని గతంలో ప్రతిపక్షస్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది. Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు! బెంగాల్ గవర్నకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.…