భారత్-బంగ్లాదేశ్ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్లోని భారత…
హైదరాబాద్కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్లో కాదు.. కోల్కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్తో కోల్కతాలో లిక్కర్ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్పేర్కొంది.…
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.…
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్లను అందించారు. కోల్కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయన కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కేకేను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి తీసుకెళ్లారు.…
బెంగాల్ లో మరో విషాదం నెలకొంది. మరో మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. మంజూషా నియోగి అనే మోడల్ కోల్ కతా పటులి ప్రాంతంలో తన నివాసంలో శవమై కనిపించింది. మూడు రోజుల వ్యవధిలో కోల్ కతాలో ఇద్దరు మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల మంజూషా నియోగి ఫ్రెండ్ మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు రోజుల నుంచి తీవ్రమైన డిప్రెషన్ తో మంజూషా నియోగి బాధపడుతోంది. తన కూతురు డిప్రెషన్ తో…
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ బిదిషా డి మజుందార్(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్ కత్తా లోని తన నివాసంలో గురువారం ఉదయం శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీలో పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న బిదిషా కోల్కతాలోని ఒక అపార్టుమెంట్ లో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇక 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్లో నటించిన ఆమె గత కొన్నిరోజులుగా బయట కనిపించడం లేదు. బుధవారం ఇంట్లో…
ఎంతటివారికైనా కొన్నిసార్లు నిరసన తప్పదు.. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరానికి నిరసన సెగ తాకింది… ఓ కేసులో వాదించేందుకు హైకోర్టుకు న్యాయవాదిగా వెళ్లారు చిదంబరం.. అయితే, ఆయన్ను కాంగ్రెస్ మద్దతుదారులైన న్యాయవాదులు అడ్డుకున్నారు… పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు చిదంబరం కారణమంటూ మండిపడ్డారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.. Read Also: Koratala shiva :…
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని…
దేశమంతటా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రూల్స్ను పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒక ఇంట్లో వ్యక్తికి కరోనా సోకితే, ఆ వ్యక్తి వారం పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఆ వ్యక్తితో పాటు ఇంట్లో ఉండేవారు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులు కావొచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావొచ్చు. ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సందే. అయితే, స్వయానా ముఖ్యమంత్రి సోదరుడు ఆ…