శంఖు ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.
Kolkata Metro Runs Under River, First In India: కోల్కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు…
భారత్ దేశంలోనే తొలి నీటి అండర్ గ్రౌండ్ లో నడిచే మెట్రో ట్రైన్ కోత్ కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది. కోల్ కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళ్తుంది.
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ…
Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేవంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పాటు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తన గాత్రంతో ఆకట్టుకున్నారు.
కోల్కతాలో గత ఉదయం తప్పిపోయిన ఏడేళ్ల బాలిక మృతిపై నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసు జీపును తగలబెట్టడంతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. దక్షిణ కోల్కతాలోని తిల్జాలాలోని తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక ఫ్లాట్లో బాలిక మృతదేహం గోనె సంచిలో కనిపించిందని పోలీసులు తెలిపారు.
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
చికిత్స కోసం భారత్కు వచ్చిన కువైట్కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
Arrest of two terrorists associated with ISIS: నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమబెంగాల్ హౌరాలో అరెస్ట్ చేశారు. కోల్కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి ఐసిస్ తో సంబంధం ఉన్న ఎండీ సద్దాం (28), సయీద్ (30)లను శుక్రవారం అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు వీరిని జనవరి 19 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిద్దరినీ…