Bank Loan Fraud: ఎస్బీఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్..
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ నుంచి రూ.95 కోట్ల రుణం పొందాడు. ఇందుకు గానూ నకిలీ పత్రాలను సమర్పించాడు.
Read Also: Srinivas Goud: హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్.. స్వాగతం పలికిన శ్రీనివాస్గౌడ్
Also Read
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
- NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
ఇదిలా ఉంటే తాను అప్పుగా తీసుకున్న పనికోసం కాకుండా ఇతర పనులకు ఈ లోన్ మొత్తాన్ని మళ్లించినట్లు విచారణలో తేలింది. దీంతో బ్యాంకును మోసం చేసిన వ్యక్తిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. నిందితుడైన వ్యాపారవేత్త కౌషిక్ కుమార్ నాథ్ ను మార్చి 30న అరెస్ట్ చేశామని, కోల్కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు అతన్ని ఏప్రిల్ 10 వరకు ఈడీ కస్టడీకి పంపిందని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోనే అతిపెద్ద రుణదాగా ఉన్న ఎస్బీఐని రూ.95 కోట్ల మేర మోసం చేసినట్లు ఈడీ తెలిపింది.
కౌషిక్ కుమార్ నాథ్ పై మనీలాండరింగ్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ అతడిపై దాఖలు చేసిన కేసులతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నాలుగు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో మనీలాండరింగ్ జరగడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కౌషిక్ కుమార్ నాథ్ తరచూ తన గుర్తింపును మార్చుకుంటూ బ్యాంకులను మోసం చేసేవాడని, ఇటీవల తన మాకాంను ముంబైకి మార్చినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 3.68 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.
తాజావార్తలు
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!