Bhola Shankar : యమహా నగరి బ్యాక్డ్రాప్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. స్టైలిష్ ఫిలింమేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. మళ్లీ 8ఏళ్ల తరవాత తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయన సరసన తమన్నా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.
https://twitter.com/BholaaShankar/status/1653746881368047616
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
Also Read : Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు
ఈ ఏడాది ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్లో యాక్షన్ సీక్వెన్స్ను, ఓ సాంగ్ ను పూర్తిచేసుకున్న చిత్ర బృందం.. కొత్త షెడ్యూల్ కోసం కోల్కతాకు బయలుదేరి వెళ్లింది. ఇవాళ్టి నుంచి యమహా నగరిలో షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని వుంది’ కోల్కతా బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్కతా బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది.
Also Read : Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..
ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. హైదరాబాద్లో ఇటీవల షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.
Also Read : Bangladesh: తనను నిరాకరించిందని హిందూ బాలిక దారుణ హత్య..
కోల్కతా షెడ్యూల్లో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, ఇతర నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను కూడా చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్లో సాంగ్ చిత్రీకరిస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూన్ నెలాఖరుకు మూవీ చిత్రీకరణ పూర్తిచేస్తారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!