కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
RG Kar EX-Principal: కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది.
Kolkata Doctor Rape and Murder Case: కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్కతా పోలీసు వర్గాలు తెలిపాయి.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు.
ఇదిలా ఉంటే, నిందితుడి అత్త తన అల్లుడిని ఉరితీయాలని డిమాండ్ చేసింది. నా కుమార్తెను అతను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లై రెండేళ్లు అయిందని, మొదట్లో 6 నెలలు అంతా బాగానే ఉందని, నా కుమార్తె 3 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో సంజయ్ రాయ్ కొట్టాడని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంగానే ఉందని, ఆమె మందుల ఖర్చులన్నీ నేను భరించలేదని చెప్పారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు
పశ్చిమ బెంగాల్ పోలీసుల సోషల్ మీడియా పోస్ట్పై చాలా దుమారం చెలరేగుతోంది. ఆగస్ట్ 14 రాత్రి నిరసనకారుల దాడిలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ గాయంపై బెంగాల్ పోలీసులు ఈ పోస్ట్ చేశారు. కోల్కతాలోని మెడికల్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు..
కోల్కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.