కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్పేట్, బాగ్ అంబర్పేట్ డివిజన్ లలో పర్యటించారు. సంభంధిత అధికారులను వెంటపెట్టుకొని పర్యటించిన కిషన్ రెడ్డి గారు మొదట అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు తర్వాత అక్కడే ఉన్న పటేల్ నగర్ గోశాల లో పశువుల సేవలో గడిపారు అనంతరం ప్రేమ్ నగర్ బస్తిలో…
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం.. అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని…
హైదరాబాద్ బంజారా లెక్ వ్యూ లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చట్టాలకు పాతర వేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు.. రెండు పార్టీలు…
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోదీ నీ బిజెపి ని ఓడించాలనీ దేశ వ్యాప్తంగా…
హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకల పై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ.. మళ్లీ తిరిగి ఎగ్జామ్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో…
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2015లో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా.. సానుకూల మార్పులు కనబడుతున్నాయని ఆయన వెల్లడించారు.
వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో పండించే వరి మద్దతు ధర కూడా పెరిగిందని, పత్తి పంట పై ఒకే సారి 500 పెంచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయం లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. జాబ్ కాలెండర్ ను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు బహిరంగ సభల్లో…
MP Aravind Kumar: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జ్వాలలు చెలరేగాయి.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కాచిగూడలోని ఆయన ఇంటిని ముట్టడించారు.