Chirag Paswan: బీహార్ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
- బీహార్ ఎన్నికల్లో పోటీపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
- కచ్చితంగా పోటీ చేసి తీరుతానంటున్న కేంద్రమంత్రి
- కాకపోతే తుది నిర్ణయం మాత్రం పార్టీదేనని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదిలోపు బీహార్ ఎన్నికలు ముగియనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధానంగా యువత ఓట్లే కీలకం. దీంతో ఇప్పటికే యువ నేతలు తేజస్వి యాదవ్, కన్హయ్యకుమార్, ప్రశాంత్ కిషోర్ లాంటివాళ్లు పొలిటికల్ యుద్ధంలోకి దిగారు. తమ సత్తాను నిరూపించుకునేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : అధిష్ఠానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకా ప్రకటించలేదు
Also Read
- Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
- Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
తాజాగా లోక్ జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఫైనల్గా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయంగా చెప్పుకొచ్చారు. తనకైతే పోటీ చేయాలనే ఉందని.. చివరిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. ప్రస్తుతం లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. మోడీ కేబినెట్లో చిరాగ్ పాశ్వాన్ మంత్రిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Iran: నెలల్లోనే పుంజుకుంటుంది.. అణు సామర్థ్యంపై ఐఏఈఏ కీలక ప్రకటన
మరోసారి అధికారం కోసం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి కూడా అధికారం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తమకు అధికారం కట్టబడితే.. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ప్రకటించారు. బీహార్ ప్రజలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
-
Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?