Traffic Diversions: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జూన్ 2న హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) ట్రాఫిక్ పోలీసులు మళ్లింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగా గన్పార్క్, ట్యాంక్బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తదితర…
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు.
KTR: చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి , విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే…
వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రాసిన ఈ పుస్తకం రాజకీయ, సామాజిక మార్పులు, రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఆయన రాసిన వార్తా కథనాల సంకలనం. తెలంగాణ ఉద్యమాన్ని, అభివృద్ధిని సరళంగా, అర్థమయ్యే…