బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆయన.. గవ్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత విజయవాడ, రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాలు పంచుకోనున్నారు. ఆ వెంటనే ఐదున్నర గంటలకు…
ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని,…
ఏపీలో కోనసీమ అల్లర్లు హాట్ టాపిక్ అవుతోంది. అల్లర్లు జరిగి వారం అవుతున్నా ఇంకా అక్కడ అలజడి చల్లారలేదు. అంబేద్కర్ పేరుని చాలా చోట్ల పెట్టినా.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరిగాయి..? బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదు.. కోనసీమలో ఎందుకు గొడవలు జరిగాయి..? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరిగాయి.కొన్ని…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి కొత్త జవసత్వాలు రాకపోగా.. నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు భగ్గుమంది. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న నేతలు ఉత్సాహంగా దూసుకెళ్దామని చూస్తుంటే పార్టీలోకి పాతకాపులు వారి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారట. వలస నేతలు రావడంతో నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొరత తీరుతుందని భావిస్తే.. ఆ దిశగా అడుగులే పడటం లేదట. దాదాపు నెల రోజుల పాటు అలంపూర్ మొదలు షాద్నగర్ వరకు సంజయ్…
కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశ ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంపై విపక్షాలు స్పందిస్తున్నాయి. తాజాగా కేంద్ర నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ ఏం లేనిదాని కన్నా ఇది మంచిది’ అంటూ కామెంట్స్ చేశారు. కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గించిన తర్వాత ఈ…
బీజేపీ నేతలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న పాలమూరు మీటింగులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు.. బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం…
పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నేతలకు నోటికి దురద పెట్టినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సన్నాసుల్లారా… 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చేసిందేమిటి? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోయిన సన్యాసులు టీఆర్ఎస్ నేతలని మండి పడ్డారు. ఆంధ్రుకు అమ్ముడుపోయి తెలంగాణకు తాకట్టు పెట్టారని అన్నారు. ఈ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో…
టీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అంటూ కామెంట్ చేశారు.. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన.. దుబ్బాకలో ధమాకా, హుజురాబాద్లో హుజూర్ గిర్గయా.. ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… బీజేపీ సర్కార్, డబులింజన్ సర్కార్ కోరుకుంటున్నారని తెలిపారు. ఇక, బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది… మోడీ సర్కారు జవాబుదారీ ప్రభుత్వంగా పేర్కొన్నారు.…
తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ.. ఇతర పార్టీల నేతలను.. బీజేపీలోకి ఆహ్వానించే పనిలోపడింది.. ఇప్పటికే చాలా మంది నేతలతో కమలం పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారట.. మరికొందరు.. వారికి టచ్లోకి వస్తున్నారట.. అయితే, పార్టీలో చేరికలు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారు చెప్పే అభ్యంతరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పనిచేయాలని సూచించారు.. దళితుల బస్తీలకు వెళ్లి వాళ్ల సమస్యలు…