Janasena Party: విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలను ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. అరెస్ట్ అయిన నేతలందరూ బెయిల్పై విడుదలయ్యే వరకు తాను విశాఖలోనే ఉంటానని పవన్…
Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు…
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని…
Vidadala Rajini: విశాఖ ఎయిర్పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి…
Vishakapatnam Police: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ పర్యటనలో మంత్రులపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర ఆయనకు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు…
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారుతోంది.. ఈ ఘటనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర… పవన్పై విరుచుకుపడడ్డారు.. నేను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అభిమానిని.. కానీ, విశాఖ ఘటనతో అయన మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణలో పెట్టుకోలేపోతున్నారన్న ఆయన.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం…
విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. విశాఖ గర్జన, పవన్ కల్యాన్ విశాఖ టూర్ సందర్భంగా.. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర మంత్రుల కాన్వాయ్లపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి విడదల రజని.. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. విశాఖలో మంత్రులందరి కార్లపై దాడులు చేయటం దారుణమైన…
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అసలు, మంత్రుల కాన్వాయ్పై దాడికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణం అంటున్నారు.. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు.. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని హితవుపలికిన ఆయన.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సౌమ్యుడు… ఆయన పై దాడి హేయమైన చర్య అన్నారు. పవన్…
ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. దీంతో, విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జనసేన శ్రేణులు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.. అయితే, దీనిపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు..…
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్.. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారని మండిపడ్డారు. గర్జన సభకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లభించింది.. కానీ, జేఏసీ విశాఖ గర్జనకు పిలుపిచ్చిన రోజునే.. పవన్ ఎందుకు విశాఖ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారు జన సైనికులా..? జన సైకోలా..? అంటూ తీవ్రంగా స్పందించారు.. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారన్న ఆయన..…