బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు.. ప్రత్యర్థుల అవసరం లేకుండానే.. వారికివారే విమర్శలు, ఆరోపణలతో రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అధిష్టానికి కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అంతే కాదు.. పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు సైతం చేశారు.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని వ్యాఖ్యానించారు.. ఇక, రాష్ట్రంలో ప్రజా…
రాజీనామా అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. పీఏసీ భేటీలో తన ఆవేదనని మాణిక్కం ఠాగూర్కి చెప్పానని తెలిపారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్గాంధీని కలుస్తానని తెలిపారు. Read Also: ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్ తన స్టాండ్ ఎప్పుడూ కాంగ్రేసేనని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బందైతే.. ఇండిపెండెంట్గానే ఉంటానని, ఏ పార్టీలోకి…
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో జగ్గారెడ్డి పాత్ర హట్ టాపిక్గా మారింది. ఐదురోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొందరూ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. నిన్న పీఏసీ సమావేశంలో వాడివేడిగా సాగిన చర్చ. అయితే ఈ చర్చలో పరోక్షంగా జగ్గారెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని నేరుగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగుర్కు సవాల్…
నేను సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి అన్నారు.ఆ లేఖ ఎలా లీక్ అయిందో నాకు తెలియదని…ఇది మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు జగ్గారెడ్డిని హాజరు కావాలనడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ పై మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా..! లేదా మీరు మీడియా లో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా..ఈ విషయం మీరు ఎందుకు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు చోటుచేసుకున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్రెడ్డిని తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్ పదవికి నియమించాలని లేఖలో కోరారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓ సీనియర్ నాయకుడిగా తాను కూడా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. Read Also: రైతులకు గుడ్…
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… ఆరింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. అయితే మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఈరోజు జరిగిన…
మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు…
కేసీఆర్ రాష్ర్టంలో రహస్యంగా పర్యటించాలంటూ కాంగ్రెస్ సీనియర్నేత జగ్గారెడ్డి అన్నారు. గతంలో ఎంతో మంది రాజులు ఇలాగే చేశారన్నారు. అప్పుడే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. వరిధాన్యం కొనకుండా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎవ్వరికి తెలియకుండా పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం అధికార పార్టీతో పోరాటం చేస్తుందన్నారు. ఎప్పుడైనా ప్రజల తరపున నిలబడేదని కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఇప్పటికైనా కేంద్రంతో…