Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు.
ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్లో నెంబర్ 2గా ఉంటారు.
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనాని గద్దె దించాలనే కుట్ర జరిగినట్లు వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ని బంగ్లాదేశ్ నుంచి తొలగించే ప్లాన్ విదేశాల నుంచి అమలు చేయబడినట్లు తెలుస్తోంది. హసీనా పదవి నుంచి దిగిపోవడం వెనక అమెరికా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనికి పాకిస్తాన్ కూడా తోడైంది.
Pakistan: సాక్ష్యాత్తు అమెరికా అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ దేశ విదేశాంగ శాఖ, పెంటగాన్ పాకిస్తాన్తో అటంకాగుతోందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్ఆర్ మెక్మాస్టర్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కి సహాయం ఆపేయాలని ఆయన చెప్పినప్పటికీ విదేశాంగ శాఖ,
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.
Pak ISI And China Forced Out Sheikh Hasina: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్థాన్, చైనాలు చాలా కాలంగా కోరుకున్నాయి.
ఉత్తరప్రదేశ్లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన.. ఇద్దరు పాకిస్థానీలు సహా ముగ్గురు ఉగ్రవాదులను యూపీ ఎస్టీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ(ISI) సాయంతో భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు ప్లాన్ చేశారు. STSF ప్రకారం.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు నేపాల్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించబోతున్నట్లు కొంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. వీరంతా భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని, ఐఎస్ఐ సాయంతో హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరంలో శిక్షణ కూడా…
Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.