Iran War: ఇరాన్ యుద్ధం బహ్రైయిన్ చావుకొచ్చింది.. పాలనమార్పు దిశగా చిన్న దేశం.!
- ఇరాన్ పాలన బహ్రైయిన్ చావుకొచ్చింది..
- బహ్రైయిన్లో పాలన మార్పు వస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నెల రోజులైంది. అమెరికా చర్చల కోసం ఒత్తిడి పెడుతున్నా, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ తన ఆయుధ శక్తితో గల్ఫ్ లోని బహ్రైయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని ఎలా అడ్డుకోవాలో గల్ఫ్ దేశాలకు అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే, ఇరాన్లో పాలన మార్చాలని అమెరికా భావిస్తోంది. కానీ ఇరాన్ బదులుగా యూఎస్ మిత్రదేశం బహ్రైయిన్లో పాలన మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ చిన్న దేశంలో అంతర్గత సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బహ్రైయిన్లో పాలకుడు సున్నీ ముస్లిం కాగా, ప్రజల్లో మెజారిటీ షియా వర్గానికి చెందిన వారు. వీరంతా ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా వీధుల్లోకి వస్తున్నారు. పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Also Read
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
- Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బహ్రెయిన్లో 200 మందికి పైగా, వీరిలో అధికశాతం షియా ముస్లింలు, అరెస్టు చేయబడ్డారు. దేశద్రోహం, గూఢచర్య, శత్రువుకు సహకరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 32 ఏళ్ల షియా కార్యకర్త మహమ్మద్ అల్మోసావి పోలీసుల అదుపులో మరణించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇతడిని చిత్రహింసలు పెట్టి చంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సున్నీల అధికారం, షియాల మెజారిటీ:
బహ్రైయిన్లో పాలకులు సున్నీ వర్గానికి చెందిన వారు. ప్రజల్లో మెజారిటీ 60 శాతం షియాలు. బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైట్స్ అండ్ డెమోక్రసీ వంటి సంస్థలు దేశంలో తీవ్రవాద వాతావరణం ఉందని చెబుతోంది. చాలా మంది అరెస్టయిన వ్యక్తులకు న్యాయవాదుల్ని కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెబుతోంది. ఇరాన్కు మద్దతు ఇచ్చే పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని వెల్లడించింది. బహ్రైయిన్ ఇరాన్ అనుకూల వర్గాల చేతిలోకి వెళ్లొద్దని సౌదీ అరేబియా భావిస్తోంది. దీంతోనే ఈ నిరసనల్ని అణిచివేసేందుకు సౌదీ బలగాలు సహకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సౌదీ, బహ్రైయిన్ పాలకులు సున్నీ వర్గానికి చెందిన వారు.
బహ్రైయిన్లో యూఎస్ 5 ఫ్లీట్ నేవీ కమాండ్ కార్యాలయం ఉంది. దీనిపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులకు బహ్రైయిన్ లోని మెజారిటీ షియాలు మద్దతు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బహ్రైయిన్ 2011 నాటి అరబ్ స్ప్రింగ్ లాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బహ్రైయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ, వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా ముఖ్యమైన దేశం.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!