Home
India
India News
-
మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు…
ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.18 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 చేరగా..… -
యూఏఈలో టీ20 వరల్డ్కప్.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం
టీ-20 వరల్డ్కప్ వేదికపై క్లారిటీ వచ్చేసింది.. యూఏఈలోనే టీ-20 వరల్డ్ కప్ నిర్వహిస్తామని తెలిపింది బీసీసీఐ.. ఈ విషయంపై ఇవాళే ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది.. అయితే, వరల్డ్ కప్ తేదీలను ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది బీసీసీఐ. దీంతో.. కరోనా ఎఫెక్ట్తో మరో మెగా టోర్నీ ఇండియా నుంచి తరలిపోయినట్టు అయ్యింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో టీ20 వరల్డ్కప్ నిర్వహించలేమని అందుకే.. యూఏఈలో టోర్నీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, టోర్నీ నిర్వహణపై బీసీసీఐకి… -
మరోసారి బరితెగించిన ట్విట్టర్.. వేరే దేశంగా లడాఖ్..
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి బరితెగించింది… రెచ్చగొట్టే చర్యలకు దిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ను వేరే దేశంగా తన వెబ్సైట్లో చూపించింది.. ఇక, జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో అంతర్భాగంగా చూపించింది.. ట్విట్టర్ చర్యలపై సీరియస్గా ఉంది భారత ప్రభుత్వం… ట్విట్టర్ గతంలోనూ ఇలాంటి తప్పులే చేసింది.. గత ఏడాది లడాఖ్ను చైనాలో అంతర్భాగమని చూపించింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది.. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే… -
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం…
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది. -
కేబినెట్ విస్తరణపై కేంద్రం కసరత్తు…కొత్తగా 27 మందికి చోటు?
త్వరలోనే కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేబినెట్ను విస్తరించబోతున్నది. కొత్తగా 27 మందికి చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ కేబినెట్లో ఆరాష్ట్రానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. Read: సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో… -
వ్యాక్సినేషన్లో ఇండియా మరో రికార్డ్…
ఇండియాలో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు. Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్! అయితే, వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా… -
ఇండియా కరోనా అప్డేట్…వెయ్యికి దిగువున మరణాలు…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. సెకండ్ వేవ్ కారణంగా పెద్దఎత్తున్న కేసులు, మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పీక్స్ దశలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మూడు నెలల తరువాత కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదవుతుండటం మంచి విషయమే. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది. Read: ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…! తాజాగా దేశంలో 46,148 కరోనా… -
చరిత్ర సృష్టించాం.. వదంతులు నమ్మొద్దు..
భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. ఒకే రోజు దేశ్యాప్తంగా 86 లక్షలకు పైగా డోసులు వేసిన కొత్త రికార్డు సృష్టించిగా.. దీనిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందన్నారు.. వ్యాక్సిన్ తీసుకోవడంపై అను అనుమానాలను అధిగమించాలని పిలుపునిచ్చారు… మహమ్మారిపై… -
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా మారాలి..
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని పిలుపునిచ్చారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామన్నారు.. మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాలన్నారు.. మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్నారు. ఆచార… -
తీరిపోనున్న వ్యాక్సిన్ కొరత కష్టాలు..! 135 కోట్ల డోసులు..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!