Home
India
India News
-
భారత్లో మరింత తీవ్రమైన పరిస్థితులు..! అమెరికా హెచ్చరిక
భారత్లో గత కొన్ని రోజులుగా 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ ఏకంగా 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. అయితే.. భారత్లో కరోనా సంక్షోభం చాలా తీవ్రంగా ఉండబోతోందని.. పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదని.. భవిష్యత్లో మరింత పీక్కు వెళ్తాయని అంచనా వేస్తోంది అమెరికా ప్రభుత్వం.. భారత్లో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… కానీ, ఇది ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదన్న అమెరికా… -
భారత్లో లాక్డౌన్ తప్పదు.. ఫౌచీ కీలక వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ భారత్లో విశ్వరూపమే చూపిస్తోంది.. ఫస్ట్ వేవ్లో లక్ష మార్క్ను కూడా టచ్ చేయలేకపోయిన కోవిడ్ కేసులు.. సెకండ్ వేవ్లో ఇప్పుడు 4 లక్షల మార్క్ను కూడా దాటేశాయి.. మరోవైపు మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.. ఈ నేపథ్యం అంతర్జాతీయంగా కోవిడ్ మహమ్మారిపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ అంథోనీ ఎస్ ఫౌచీ.. భారత్లో మహమ్మారి కట్టడికి మోడీ సర్కార్కు కీలక సూచనలు చేశారు.. అందులో వ్యాక్సినేషన్, ఆస్పత్రులతో పాటు.. లాక్డౌన్ కూడా… -
ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. భారత్ నుంచి వస్తే అంతే..!
భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు… -
భారత్ కోవిడ్ కొత్త రికార్డు.. 4 లక్షల మార్క్ కూడా దాటేసి..
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. సెకండ్ వేవ్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.. ఇవాళ ఏకంగా 4 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేసింది కరోనా రోజువారి కేసుల కౌంట్.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3523 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,99,988 మంది కోవిడ్… -
ఏపీలో కరోనా విజృంభణ.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు
ఇది కరోనా కాలం.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, తమకు అందుబాటులో ఉన్నపీహెచ్సీ ఏది..? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి..? మరెక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసినవారిని అడిగి వాకాబు చేయాల్సిన పరిస్థితి.. అయితే, ఈ కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్బుక్ కొత్త టూల్ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్లో ఈ… -
వచ్చేస్తోంది ఆఫర్ల పండుగ.. 80 శాతం వరకు డిస్కౌంట్లు..!
ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు తెస్తూనే ఉంటాయి.. పండగల సీజన్ వచ్చినా.. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తున్నా.. ముందే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.. తాజాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొనసాగనుంది ఈ ప్రత్యేక సేల్.. ఇక, ప్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే, ఒకరోజు… -
విమాన సర్వీసులపు డీజీసీఏ కీలక నిర్ణయం..
కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్… -
జో బైడెన్ 100 రోజుల పాలన: భారత్ తో బంధం బలపడిందా?
అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా అయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ తో ఈ వందరోజుల్లో ఎలాంటి బంధం బలపడిందో వివరించారు. వంద రోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందని, ఇటీవలే ప్రధాని మోడీతో తాను మాట్లాడానని తెలిపారు. అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి… -
భయపెడుతున్న కరోనా… నాలుగు లక్షలకు చేరువలో కేసులు
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర… -
వేగంగా టీకాలు వేస్తున్న దేశం మనదే-కేంద్రం
కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు భారత్లో 45 ఏళ్లు పైబడినవారికి వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తారు.. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లోనే వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని కేంద్రం ప్రకటించింది.. కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.. వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదేనని.. అదే…
తాజావార్తలు
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!