అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ…
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్జోష్లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది.
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం రాత్రి ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. అనంతరం భారత్పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించినట్లైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్కు కూడా మంచి ఊపునిచ్చింది. భారీ స్థాయిలో లాభాల్లో దూసుకుపోతుంది.
అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (38) అనే అంగన్వాడీ టీచర్, ఆమె కుమారుడు చిన్న (22)ను హత్య చేశారు. ఈ ఘటన వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి…
భారత్-అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం మోడీ-ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. అనంతరం భారత్పై 18 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడ్డాయి. అంతేకాకుండా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు దోహదపడనుంది.
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ * నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు ఉదయం పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.. రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసంకు రానున్న మంత్రి నారా లోకేష్… * హైదరాబాద్: నేడు కేంద్ర బొగ్గు మరియు…
సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..! సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర…
పెద్దపులి కలకలం.. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటన.. రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టించింది. తొర్రేడు హైస్కూల్ సమీపంలోని అరటి తోటలో పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనావాసాలకు అతి సమీపంలో అరటి తోటల్లో పులి సంచరిస్తుండటంతో గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పులి సీతానగరం మండలం రాపాక గ్రామం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ 15 ట్రాప్ కెమెరాలు, రెండు…
* అమరావతి: నేడు జనసేన పార్టీ కీలక సమావేశం.. పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం.. * అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * తూర్పుగోదావరి జిల్లా: పులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు.. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ఈ చర్యలు తీసుకున్న విద్యా శాఖ..…