ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల…
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది. కరోనా కేసులు తగ్గుముఖం…
శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని…
స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయం పట్టుకున్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్ని సందిగ్ద పరిస్థితులు మార్కెట్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు కుప్పకూలడంతో ఆందోళన మదుపురుల్లో ఆందోళన మొదలైంది సెన్సెక్స్ 382.91 పాయింట్ల నష్టపోయి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు కోల్పోయి 17,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. Read: Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో…
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు…
ఇవాళ ట్విన్స్ డే. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వారంతా కలిసి చేసుకునే అద్భుతమయిన వేడుక అది. సాగరతీరం విశాఖలో కవలలు సందడి చేశారు. విశాఖలో 30కి పైగా కవల జంటలు ఆడి పాడారు. అందరితో సంతోషంగా గడిపారు. ఒకేరూపం మనుషులు మాత్రం ఇద్దరు. అదేదో సినిమాలో చూసినట్టుగా వీరంతా ఒకేచోట కలిసి చేసిన సందడి అదరహో అనిపించింది. విశాఖ నగరంలోని ఓ హోటల్ లో ట్విన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ-తెలంగాణ కు చెందిన…
ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు…
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీలలో ప్రస్తుతం బీజేపీకి గణనీయమైన బలం ఉంది. కాబట్టి పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి తిరిగి అధికారం దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చాయనేదిముఖ్యం. ఎందుకంటే బొటా బొటి మెజార్టీతో ఆయా రాష్ట్రాలలో అధికారం తిరిగి చేజిక్కించుకుంటే రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుంది. లోక్సభలో పూర్తి మెజార్టీ…
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని పేర్కొన్నారు. భాష అనేది మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే…
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తలపై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఉక్రెయిన్లోని భారతీయులు వెనక్కి రావాలని కోరింది భారత విదేశాంగ శాఖ.. ఇక, భారత పౌరులను తరలించేందుకు చర్యలను కూడా ప్రారంభించింది.. ఇవాళ రాత్రి ఉక్రెయిన్ నుంచి భారత్కు ప్రత్యేక విమానం రానుంది. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి బోయింగ్ 787 విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానంలో 200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగిరానున్నారు. ఇక, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్.. ప్రస్తుతం జరుగుతున్న…