Khalistani Terrorist Sukha Duneke Killed In Canada Gang War: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు పేర్కొన్నాయి. విన్నిపెగ్లో బుధవారం రాత్రి ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్స్టర్ సుఖ్దోల్ సింగ్…
దాదాది దేశమైన పాకిస్థాన్ భారత్పై ఎప్పుడూ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటుంది. పాక్ మరోసారి భారత్పై విషం చిమ్మింది. పాకిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ భారత్పై విషం చిమ్మడంలో బిలావల్ భుట్టో జర్దారీని సమం చేయడం ప్రారంభించారు.
NIA: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదం చిచ్చుపెట్టింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి.
శుభ్ నీత్ ఫేవరెట్ ఆర్టిస్ట్ అని గతంలో ఓసారి విరాట్ కోహ్లీ చెప్పాడు.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్ను ఇన్స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాలతో వీరందరూ అతడిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్లు సమాచారం.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్హౌస్గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
కెనడా పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని భారత్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇరు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. కెనడా చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులకు భారతదేశం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే నెల రోజుల పాటు ఫుల్గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్లు ఆడనుంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్…
భారత్కు చెందిన ఏజెంట్లకు ఖలిస్తానీ ఉగ్రవాది హత్యతో సంబంధం ఉందని సూచించడం ద్వారా భారత్ను రెచ్చగొట్టేందుకు కెనడా ప్రయత్నించడం లేదని, అయితే ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించాలని కెనడా భారత్ను కోరుతున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు.
దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు.