Virat Kohli: కెనడాలో టెన్షన్ టెన్షన్.. ఫేవరెట్ సింగర్ను అన్ ఫాలో చేసిన విరాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్కు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ తో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, కెనడాలో ఉంటున్న ప్రముఖ భారత గాయకుడు శుభ్నీత్ సింగ్ విమర్శల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్లు అతడిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. దీంతో అతడి భారత్ పర్యటన కూడా రద్దయ్యింది.
Read Also: Rahul Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉంది..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అయితే, పంజాబ్కు చెందిన సింగర్, నటుడు రన్వీత్ సింగ్ సోదరుడైన శుభ్నీత్ కొన్నేళ్ల క్రితం కెనడాలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తన ర్యాప్ సింగింగ్ జర్నీని స్టార్ట్ చేశాడు. 2021లో అతడు ‘వి రోల్ ఇన్’ పేరుతో ఓ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులర్ అయింది. కోట్ల మంది ఆ సాంగ్ ను వీక్షించారు. ఆ తర్వాత ‘డోంట్ లుక్’ పాటతో ర్యాప్ ప్యాన్స్ కి మరింత దగ్గరయ్యాడు. దీంతో ‘స్టిల్ రోల్ ఇన్’ పేరుతో ర్యాప్ సింగర్గా తన తొలి భారత్ టూర్ను శుభ్ నీత్ ఇటీవల ప్రకటించాడు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 10 నగరాల్లో తన ప్రదర్శనలిచ్చేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబరు 23-25 తేదీల్లో ముంబయిలో అతడు పర్యటించాల్సి ఉంది.
Read Also: Akkineni Nageswara Rao: అతిరథ మహారథుల సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ
ఇక, శుభ్ నీత్ ఇటీవల సోషల్ మీడియాలో ఖలిస్థానీ ఉద్యమానికి సపోర్ట్ గా కొన్ని పోస్టులు చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భారత్కు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతకర ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అతడి ప్రదర్శనను క్యాన్సిల్ చేయాలని ఇటీవల ముంబయిలో బీజేపీ యువజన విభాగం నిరసనకు దిగింది. శుభ్ నీత్ ఫేవరెట్ ఆర్టిస్ట్ అని గతంలో ఓసారి విరాట్ కోహ్లీ చెప్పాడు.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్ను ఇన్స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాలతో వీరందరూ అతడిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!