ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన పరుగులను ఛేదించే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా జట్టు ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకోవాలని చూస్తోందని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. "ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్" అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు.
Maldives: మాల్దీవులు అన్నంత పనిచేసింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత.. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉనికి ఉపసంహరించుకోవాలని కోరింది. అంతకుముందు రోజు ప్రయాణ స్వీకారానికి భారత్ తరుపున మాల్దీవులు వెళ్లిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజును కలిసినప్పుడు, ముయిజ్జూ అధికారికంగా ఈ అభ్యర్థన చేసినట్లు తెలిసింది.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్లను గుర్తించారు. ఈ యాప్లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు…
రేపు (ఆదివారం) ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మహా సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ పరిస్థితులను ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ పరిశీలించారు.
Miss Universe 2023: ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఫైనల్స్ శనివారం రాత్రి జరగనున్నాయి. 90 దేశాలకు చెందిన తెల్లజాతీయులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మిస్ దివా శ్వేతా శారదా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది.