BSP: మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. ఇండియా కూటమిలో చేరుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార బీజేపీ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ఈ కూటమిలో పలు పార్టీలకు చెందిన వారిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు బహుజన్ సమాజ్ వాది పార్టీని సైతం భారత్ కూటమిలో జాయిన్ కావాలని కోరారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్పందిస్తూ.. బీఎస్పీ చీఫ్ మాయవతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించాలని షరతు విధించారు. దీంతో పాటే గత కొద్ది రోజులుగా మాయవతి ఢిల్లీలోనే ఉన్నారు.
Read Also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అయితే, బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.. ఎందుకంటే, మాయావతికి 13 శాతం ఓట్లు, విపక్షాలకు 37-38 శాతం ఓట్లు నిర్ణయాత్మక ఆధిక్యాన్ని ఇవ్వగలవు.. ఇది ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి 44 శాతం కంటే ఎక్కువగా ఉంది.. అయితే, భారత కూటమి అధికారంలోకి రావాలంటే తప్పకుండా మాయావతిని భారతదేశ ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని మలక్ నగర్ అన్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుంది.. దాంతో పాటు ఓట్ల శాతం ఇండియా కూటమికి మేలు చేస్తుంది అని బీఎస్పీ ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Vijayakanth: కోలీవుడ్ లో విషాదం… ‘ది కెప్టెన్’ ఇక సెలవు
ఇక, ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశంలో అఖిలేష్ యాదవ్ బీఎస్పీతో చర్చల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి వెలుపల బీఎస్పీతో చర్చలు జరుపుతోందా.. బీఎస్పీని ఈ కూటమిలోకి తీసుకురావాలనుకుంటున్నారా? ముందుగానే ఈ విషయంలో కాంగ్రెస్ తన స్టాండ్ను స్పష్టం చేయాలి అని ఆయన కోరారు. అలాగే, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా బీఎస్పీ గురించి మాట్లాడుతూ.. తాము బీఎస్పీతో మాట్లాడటం లేదు.. మీడియాలో కథనాలు వచ్చాయి.. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇండియా కూటమిలో చేరడం ఇష్టం లేదని మొదటి రోజు నుంచి చెబుతున్నారు.. బలవంతంగా వారిని కూటమిలో చేర్చుకోలేమని ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి వెల్లడించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..