BSP: మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. ఇండియా కూటమిలో చేరుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార బీజేపీ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ఈ కూటమిలో పలు పార్టీలకు చెందిన వారిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు బహుజన్ సమాజ్ వాది పార్టీని సైతం భారత్ కూటమిలో జాయిన్ కావాలని కోరారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్పందిస్తూ.. బీఎస్పీ చీఫ్ మాయవతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించాలని షరతు విధించారు. దీంతో పాటే గత కొద్ది రోజులుగా మాయవతి ఢిల్లీలోనే ఉన్నారు.
Read Also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
Also Read
- India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
అయితే, బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.. ఎందుకంటే, మాయావతికి 13 శాతం ఓట్లు, విపక్షాలకు 37-38 శాతం ఓట్లు నిర్ణయాత్మక ఆధిక్యాన్ని ఇవ్వగలవు.. ఇది ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి 44 శాతం కంటే ఎక్కువగా ఉంది.. అయితే, భారత కూటమి అధికారంలోకి రావాలంటే తప్పకుండా మాయావతిని భారతదేశ ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని మలక్ నగర్ అన్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుంది.. దాంతో పాటు ఓట్ల శాతం ఇండియా కూటమికి మేలు చేస్తుంది అని బీఎస్పీ ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Vijayakanth: కోలీవుడ్ లో విషాదం… ‘ది కెప్టెన్’ ఇక సెలవు
ఇక, ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశంలో అఖిలేష్ యాదవ్ బీఎస్పీతో చర్చల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి వెలుపల బీఎస్పీతో చర్చలు జరుపుతోందా.. బీఎస్పీని ఈ కూటమిలోకి తీసుకురావాలనుకుంటున్నారా? ముందుగానే ఈ విషయంలో కాంగ్రెస్ తన స్టాండ్ను స్పష్టం చేయాలి అని ఆయన కోరారు. అలాగే, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా బీఎస్పీ గురించి మాట్లాడుతూ.. తాము బీఎస్పీతో మాట్లాడటం లేదు.. మీడియాలో కథనాలు వచ్చాయి.. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇండియా కూటమిలో చేరడం ఇష్టం లేదని మొదటి రోజు నుంచి చెబుతున్నారు.. బలవంతంగా వారిని కూటమిలో చేర్చుకోలేమని ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి వెల్లడించారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!