ABHISHEK SHARMA: గౌహతిలో న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్సింగ్ ఆడారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేస్తే, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.