Home
India Russia Relations
India Russia Relations News
-
India Russia Relations: భారత్-రష్యాపై అమెరికాతో సహా పాశ్చాత్య దేశాల ఒత్తిడి..! తగ్గేదేలే అంటున్న ఇరు దేశాలు..?
India Russia Relations: భారత్, రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సుంకాలు విధించిన భారత్ తగ్గేదేలే అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్లోని రష్యా రాయబారి కీలక ప్రకటన చేశారు. -
Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..
Hyderabad Man In Russia: గల్ఫ్ మోసాలు చూస్తూనే ఉంటాం. ఏమీ తెలియని.. చదువు రాని అమాయకులను.. ఏజెంట్లు మోసం చేస్తుంటారు. హైదరాబాద్లో చదువు ఉండి కూడా ఓ యువకుడు కన్సల్టెన్సీ చేతిలో మోసపోయాడు. రష్యాకు వెళ్లిన అతడికి దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. సెల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకుని రక్షించాలని వేడుకుంటున్నాడు. ఇంతకూ రష్యాలో అతడికి ఎదురైన అనుభవం ఏంటి? ఆ యువకుడి పేరు మహ్మద్ అహ్మద్. ఇతడు దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్నాడు.… -
Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్..
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో… -
Vladimir Putin: పుతిన్ భారత పర్యటన.. డిసెంబర్ 5-6లో వచ్చే అవకాశం..
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా భారత్పై సుంకాలు విధించిన తర్వాత, రష్యా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ నేపథ్యంతో పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. -
India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు. -
Pakistan PM: మోడీ సార్ అక్కడ, స్కూల్ పిల్లాడిలా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్..
Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది. -
Putin: మోడీ కోసం పుతిన్ వెయిటింగ్.. ఇది కదా భారత్-రష్యా స్నేహం..
Putin: చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న 25వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, ఈ సమావేశం జరుగుతుండటంతో ప్రపంచ దృష్టి అంతా ఈ సమావేశాలపైనే ఉంది. -
SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!
SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై… -
Putin to Visit India: భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు.. ట్రంప్ ఒత్తిడి మధ్య మోడీ-పుతిన్ కొత్త వ్యూహం..!
Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు. -
Ajit Doval: డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరిక.. రష్యా టూర్ కి అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది.
తాజావార్తలు
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!