Putin to Visit India: భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు.. ట్రంప్ ఒత్తిడి మధ్య మోడీ-పుతిన్ కొత్త వ్యూహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు. రాబోయే సమావేశం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆగస్టు చివరిలో అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తారని అజిత్ దోవల్ చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ ఇంటర్ఫ్యాక్స్ గతంలో ఉటంకించింది. అయితే.. తరువాత వార్తలను సవరించి, అధ్యక్షుడు పుతిన్ 2025 చివరిలో భారత్ను సందర్శిస్తారని ఏజెన్సీ తెలిపింది. కాగా.. ట్రంప్ ఒత్తిడి మధ్య మోడీ-పుతిన్ కొత్త వ్యూహం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై భారీ ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Trump’s South Asia Strategy: ట్రంప్ ప్లాన్ ఏంటి..? పాకిస్థాన్ను పావుగా మార్చుకున్నారా..?
Also Read
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్పై 25% సుంకం విధించారు. కొన్ని రోజుల తర్వాత.. రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్పై సుంకాలను పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయడమే కాకుండా.. కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తోంది. రష్యా యుద్ధ యంత్రం ఉక్రెయిన్లో ఎంత మందిని చంపుతుందో భారత్ పట్టించుకోవడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్పై సుంకాన్ని పెంచబోతున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం భారత్పై అదనంగా 25% సుంకాన్ని ప్రకటించారు. దీంతోమొత్తం సుంకం 50% కి చేరుకుంది.
READ MORE: Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!